పుట:Parama yaugi vilaasamu (1928).pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

620

పరమయోగివిలాసము.


నామాట విని యప్పుడాగోష్ఠిపూర్ణుఁ
డామౌనిఁ జేరంగ నఱిముఱి వచ్చి
యేమోయి యిటకు మీ రిరువురుఁ దక్క
నీమహనీయార్థ మెవ్వరితోడఁ
జెప్పకు మని బుద్ది చెప్పితి నానఁ
దప్పి యీగతి సేయఁ దగునె నీ కిపుడు
క్షితిగురుతోడ బొంకినవాని కరయ
గతి యెద్ది తుది నరకమెకాక యనిన
ననియె రామానుజుం డాగోష్ఠిపూర్ణుఁ
గని యొక్కరుఁడు నరకముఁ బొంద నేమి
యిందఱు మీకృప నీడేరి శౌరిఁ
జెందుదు రని యేను జెప్పితి ననినఁ
గౌఁగిటఁ జేర్చి లక్ష్మణమౌనివర్యు
వీఁగనికూర్మితో వినుతులు చేసి
యిల సర్వలోకుల నీడేర్పవచ్చు
నలవాఁడ వీ వని యందంద పొగడి
యిటమీఁద దొరఁకొని యీదర్శనంబు
పటుగతి నీపేరఁ బరఁగు నెల్లెడల
నని వరం బిచ్చి నిజాత్మజు శిష్యు
నొనరించె నప్పు డయ్యోగిచంద్రునకు