పుట:Parama yaugi vilaasamu (1928).pdf/632

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాశ్వాసము.

615


ముదమున నడుగుఁదమ్ములఁ బ్రసాదించి
తుదలేనివేడ్కతోఁ దోకొనివచ్చె
నాలక్ష్మణార్యుండు నఖిలభాగవత
జాలంబుతోఁగూడఁ జనుదెంచి భక్తి
శ్రీరంగనాథుని చెలువంబు కన్ను
లారంగ మఱియు నందంద సేవింప
నారంగవిభుఁడు రామానుజాచార్యుఁ
జేరంగఁ బిలిచి మచ్చికసేసి నీవు
నొగి నేనె పాలింపుచున్న విభూతి
యుగము నీ కిచ్చితి నొకకొఱలేదు
పన్ని మామకగృహపరికరాదులకు
నన్నిటికిని గర్త వైయుండు మనిన
నాయెడ రంగనాయకుని దివ్యాజ్ఞ
త్రోయక యమ్మౌని తోయజతరణి
నిఖిలేశుఁ డగురంగనిలయు కోవెలకు
నఖిలంబునకుఁ గర్తయై తాను నిలిచి
యగు ననువారల నగు నంచు మెచ్చి
తగ దనువారలఁ దగ దంచుఁ దిగిచి
యామీఁద నిజశిష్యుఁ డగునకలంక
భూమీశుఁ డనురాజపుంగవు నొకని