ఈ పుట ఆమోదించబడ్డది
అష్టమాశ్వాసము.
605
నున్నట్టి యాదేశికోత్తముఁ గాంచి
వెన్నెలఁ బొడఁగన్న వెన్నెలపులుఁగు
సరవి భానుని గన్నజలజంబుకరణిఁ
గర మర్థి పాదపంకజముల వ్రాలి
యున్న రామానుజు నొగి గౌఁగిలించి
కన్నీరు దుడిచి యంగములెల్ల నివుర
నామహాపూర్ణున కాలక్ష్మణార్యుఁ
డామోద మెసఁగ నిట్లని విన్నవించె
నుపదేష్ట మగుచు హితోపదేశంబుఁ
గృపఁజేసి నను గటాక్షింపంగవలయు
నన విని శ్రీకాంచి యల్లదే యింక
ననతిదూరము మన మటఁ బోయినపుడు
ఠేవగాఁ బుణ్యకోటిచ్ఛాయ నచట
దేవనాథునిసన్నిధిని సకలములు
నలయామునాచార్యు నన్నియు మీరు
తెలివిమీఱఁగఁ బ్రసాదించెద రనినఁ
గటకటా మున్నెఱుంగరె యామునార్యు
నటఁ బోయి కనియెద మని పోయినప్పు
డేమయ్య దేహంబు లెన్న నిత్యములె
యీమెయి మీ రానతిత్తురె యిపుడు