పుట:Parama yaugi vilaasamu (1928).pdf/612

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాశ్వాసము.

595


ననుపముం డైనరామానుజార్యుండు
తను నేగు మనిన నీధరణీశసుతుని
విడచి యీపుట్టువు విడిచి ముక్తికిని
నడచెద నంచు గ్రన్నన లేచి వచ్చి
యాదట రామానుజాచార్యవర్యు
పాదపద్మములపైఁ బ్రణమిల్లి పొగడఁ
గని యాదవుండు భూకాంతుండు నట్ల
యనుమని వేఁడ రామానుజార్యుండు
భూవిభుసుతుఁ బాసి పొమ్ము నీ వట్ల
పోవు నందులకు నిప్పుడు గుఱు తొకటి
యెనయంగ నిందఱ కెఱుఁగంగఁ జూపి
చనుమన్న బ్రహ్మరాక్షసుఁడు మోదించి
యాయున్న రావి యాయతశాఖ విఱిచి
పోయెద నని చెప్పి భూపాలసుతుని
వదలి యాచెంత నశ్వత్థంబునందుఁ
బొదలిన యొకమహాద్భుతశాఖ విఱిచి
రామానుజుని పరిగ్రహవిశేషమునఁ
దా ముక్తిపదము నిత్తఱిఁ బ్రవేశింతు
నని చెప్పి యరిగిన నాలక్ష్మణార్యుఁ
గని వెఱఁ గంది యాకాంతుఁ డెంతయును