ఈ పుట ఆమోదించబడ్డది
అష్టమాశ్వాసము.
587
చని రంగవిభునియాస్థానంబులోన
గొలువున్నతఱి శఠకోపప్రబంధ
మలనాథమునివంశుఁ డైనగాయకుఁడు
ఒగి వినిపింపుచునుండినయంత
నగరేశు శ్రీపద్మనాభుని వేగ
సేవింపుఁ డని తమ్ము చేజేతఁ జూపి
యా వేళ బలుమాఱు నభినయించుటయు
నది గని రంగేశుననుమతి యనుచు
మదిలోన యామునమౌని చింతించి
వేవేగ నాదేవువీటికి నరిగి
సేవించి యచట వేంచేసియున్నపుడు
తమకు నాకురు కేశు తాతముందరను
బ్రమదంబుతో నిచ్చుపత్రికఁ జూపి
యామౌని ముక్తికి నరిగెడువేళ
యామాసమును నాడియైన [1]బొంకుచును
గటకటా యొకపుష్పకము గల్గెనేని
యటపోవవచ్చుఁగా యని యట్ల వగచి
తనశిష్యులును దాను దడయక మగుడి
చనుదెంచి రంగవాసంబున నిల్చి
శ్రీవేంకటాద్రిగోష్ఠీపురస్థలిని
- ↑ పొక్కు