ఈ పుట ఆమోదించబడ్డది
566
పరమయోగివిలాసము.
నావుఁ డీకృతి యోగినాయకోత్తముఁడు
కావించి కడుఁ బెక్కుకాలంబు సనియెఁ
బరికింపఁగా నీప్రబధంబు ముక్తి
కరమైనకతన లోకములోన మునుపు
యంతయుం జదివి నీయంతమాత్రంబె
యెంతయు ముక్తికి నేగుచుండుదురు
కావున ఖిల మయ్యెఁ గడమవృత్తములు
రావయ్యె ననిన నరసి నాథమౌని
కురుకకు నరిగి యాకురుకేశుఁ గాంచి
వరభక్తి నిదురవోవనిచింతక్రింద
నెలకొని శఠకోపనిజమూర్తిఁ గాన
వలయునుపాయంబు వరుసఁ జితించి
యెలమితో మధురకవీంద్రుండు మున్ను
పలికిన దివ్యప్రబంధ మంతయును
దాలిమితోడ నాదటం బదిరెండు
వేలు చందమున నావృత్తి గావింప
దాకొన్న [1]కరుణలో దరువులు వెట్ట
వైకుంఠముననుండి వచ్చి శఠారి
యతనికిఁ బ్రత్యక్ష మయ్యె నావేళ
నతిభక్తి నిరతుఁడై యానాథమౌని
- ↑ గతులతో