ఈ పుట ఆమోదించబడ్డది
సప్తమాశ్వాసము.
555
హరిభక్తిపరమతి యైన యాసాధ్వి
సరవి యంతయు మానసంబునఁ దెలిసి
వెలయంగఁ దనకన్నవిధము శిష్యులకుఁ
దెలిపి మీ రిపుడు సందేహింప కరిగి
యలకృష్ణుతోఁగూడ నాకాంత నేను
బిలిచెద నని చెప్పి పిలిచి తోతెండు
అన విని [1]పరిజను లట్ల కా కనుచుఁ
జని యటనున్న వైష్ణవిఁ జేరవచ్చి
కనుఁగొని యాపరకాలు వాక్యములు
వినుపించి రమ్మన వెఱఁ గందికొనుచు
సతతంబు నీకలశములోనినంద
సుతు నర్చనముసేయుచొప్పు నాతలఁపు
నేనెఱుంగుదు గాని యింటిలోవారు
గాన రీగతి యెట్లు కనియెనో ఘనుఁడు
మానుగా నతఁడు నిర్మలుఁ డైనయోగి
కాని సామాన్యుండు గాఁడు భావింప
నావైష్ణవోత్తము నంఘ్రిపద్మములు
సేవించి యభిమతసిద్ధిఁ బొందెదను
అని కుండలో నున్న యావాసుదేవుఁ
గొని కూర్మితోడ నక్కునఁ జేర్చికొనుచుఁ
- ↑ దరి