ఈ పుట ఆమోదించబడ్డది
42
పరమయోగివిలాసము.
నకలంక మైనట్టి యయ్యోగిహృదయ
వికచాంబుజంబుఁ బ్రవేశించి రంత
మురవైరి నాబాల్యమున నుండి చిత్త
సరసిజాంతరములఁ జక్కఁగా నిలిపి
పరిపూర్ణచిత్తు లై బ్రహ్మవిన్యస్త
భరు లైన యయ్యోగివరులు మువ్వురును
దముఁ బోలినట్టి యుత్తము లైనయోగి
తము లెవ్వ రని దేవతామందిరముల
నదుల దేశముల నానాతీర్థములను
వెదకుచు నొక్కచో వీసమంతయును
నాసక్తి లేక సాయంగేహు లగుచు
భాసిల్లుచుండిరి పంకజోదరుఁడు
వారల నిజమహత్త్వంబు నియ్యెడల
వారని తనపరత్వంబు మోకముల
నెగడించి యజ్ఞాననికరమోహంబు
లగలింతు నని యెన్ని యాయోగివరుల
ముగురి నాకస్మికముగ దేవనగరి
నగుచుండు శ్రీవామనక్షేత్రనగరి
నొనఁగూర్ప బయటఁ బురోపకంఠమున
నునికిగా నల్లంత నున్న యత్తఱిని