ఈ పుట ఆమోదించబడ్డది
సప్తమాశ్వాసము.
527
యెన్ని చందంబుల నీడేరవలయు
నున్నవిచారంబు లొండేమి వలదు
తను మీర లిచట నిత్తఱి డించిపోవఁ
గనిన బౌద్ధులు మిమ్ముఁ గదిమి చెండాడి
కైంకర్యమునకు విఘ్నము సేయఁదలఁతు
రింకఁ గొంకఁగ నేల నిదె వేగ వచ్చె
నరయ నర్థంబుఁ బ్రాణాభిమానములు
వరుసతో నేలినవారివి గానఁ
బతి నాకు శ్రీరంగఫణిరాజశాయి
యతనివే తనదుప్రాణాభిమానములు
పతికార్యమునకు నై ప్రాణంబు లొసఁగు
నతఁడు సద్గతిఁ గాంచు నని యండ్రు బుధులు
ఒకగువ్వకై తను వొసఁగి రాసుతుఁడు
సకలలోకంబుల సన్నుతిఁ బడసెఁ
బరతత్త్వమునకుఁ గాఁ బ్రాణంబు లొసఁగ
నరయ నందుల భాగ్య మది చెప్ప నేల
తనతలఁ గొట్టి యిత్తఱి నుండనీక
కొనిపొండు వట్టిజాగులు మాని మీరు
అన విని పరకాలుఁ డౌరౌర యనుచు
ననుజాతపతిమాట కందంద మెచ్చి