పుట:Parama yaugi vilaasamu (1928).pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము.

519


గని మ్రొక్క మానవకరివైరి యపుడు
తనభక్తుమాట తథ్యము సేయవలసి
యాయోగితో మాటలాడ నమ్మౌని
యాయిందిరేశుఁ బాయకయుండె నంతఁ
బరకాలుఁ డాకట్టు [1]ప్రాకార మెల్ల
నరుదారఁ గట్టించి యంతటిమీఁద
ముదము నఖిలమైన మూడవకోట
యదియునుంగట్టింప నాత్మఁదలంచి
యేమిసేయుదు నింక నీసాలమునకు
హేమంబు చాలంగ నెటనుండి వచ్చు
నని తనయొద్ద డాయఁగఁ గొల్చియున్న
యనుపములైన యేకాంగవీరులను
రాయదొంగలఁ చౌర్యరసికశేఖరుల
నాయెడం బిల్చి రహస్యంబునందుఁ
బన్ని యీమూడవ ప్రాసాదమింక
నెన్నిలాగులనైన నీడేర్పవలయు
నలవిమాలిన దీనికై యిటమీఁద
బలువైనధనము సంపాదింపవలయుఁ
గాచిదొంగిలితేరఁ గలరె వేవేగ
మీచేత నగునె యిమ్మెయి విచారంబు?


  1. ప్రాసాద