పుట:Parama yaugi vilaasamu (1928).pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

514

పరమయోగివిలాసము.


నగునట్టి శ్రీవేంకటాద్రినాయకుఁడు
జగదేకనాథుఁ డాశత్రుకాలుసకు
బొడకట్టి తనకరముల మేను నిమిరి
వడదేర్చి లాలించి వరదుఁడై పలుక
[1]నావేల్పువేల్పు రెప్పార్పక చూచి
భావించి సేవించి ప్రణుతి గావించి
యా దేవదేవుని యనుమతిఁ గూడ
నాదండ శోభిల్లు నతనిమూర్తులను
సేవించి యాపరజిత్తు క్రమ్మఱను
వేవేగ శ్రీరంగవిభుని సేవింప
నరుగుచు సకలదేశాధినాయకులుఁ
గరమర్థి నిచ్చలుం గానుక లొసఁగు
వరసువర్ణాదిసువస్తువు ల్గొనుచు
సరవి రంగమునకుఁ జనుదెంచె నప్పు
డావేల్పురాయని యడుగుదామరలు
సేవించి ప్రణమిల్లి చిరతరభక్తి
లలిమించువేల్పు నీలపుచందరాల
నలుపారు నల్లసేనపుజంగరాల
నలఘువైభవముల నట రెండుసాల
ములును వంటిల్లును మొదలుగాఁ గలుగు


  1. నావేల్పు ఱేని