పుట:Parama yaugi vilaasamu (1928).pdf/514

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[32]

సప్తమాశ్వాసము.

497


మొదలైనసిరులచే మొనసి యెంతయును
బదియాఱువన్నెలం బరఁగుతామరలు
గలిగి యేతెంచుగంగాప్రవాహంబు
చెలువునఁ దనదైనసేన యేతేర
నాచేర్వ భటులతో నలపరాంతకుఁడు
గాచినత్రోవచక్కటి కేగునపుడు
మును రావి నెక్కి యిమ్ములనుండి యనువు
గనుఁగొను నలపరకాలకింకరులు
పొలయుకంజాప్తదీప్తుల కెంతె మాఱు
మలయుతేజములఁ బల్మరుఁ దళ్లుకొనుచు
ననతిదూరంబున నావచ్చుసేనఁ
గనుఁగొని పరకాలుఁ గాంచి యిట్లనిరి
మునుకొని యొకపెనుమూఁక యేతెంచె
వెనుక నెన్నడు కన్న విన్నది కాదు
మదిఁ గొంకు లేకయే మఱి చాలు గట్టి
యదె చేరవచ్చుచున్నది మహాసేన
యననేల పలుమాట లంతయు నెంత
ధనముకుప్పది యొకింతయుఁ బొల్లులేదు
మనము భాగవతసమర్చనం బనిశ
మొనరింప నందులో నొకసొమ్మె చాలు