పుట:Parama yaugi vilaasamu (1928).pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[31]

షష్ఠాశ్వాసము.

481


యతనిసమ్మతిఁ దొంటియావాసమునకు
నతులమోహనమూర్తి యై యేగె నంత
జననాథుమంత్రు లచ్చట నున్నయట్టి
ధనము ధాన్యము సమస్తము వేడ్కతోడఁ
గైకొని పరకాలు గారవం బెసఁగఁ
దోకొని మిగుల సంతుష్టులై యరిగి
ధరణీశునెదుటఁ దద్ధనము ధాన్యమును
నరిదండధరు నిడి యాక్రమం బెల్ల
వినిపింప నాశ్చర్యవివశుఁడై నృపతి
తనమదిలోన నెంతయు సంతసించి
తననిష్ఠఁ దప్పక తరవాత మనల
ధనము చెల్లించె నెంతటిఘనుం డనుచు
నపుడు భాగవతార్యుఁ డగుపరకాలుఁ
డుపవాసమున నాక నుండుట కలిగి
పారంబులేని తత్పాపంబు వాయ
ధారుణీసురులకు దానంబు లొసఁగి
పగటేది మఱి పట్టభద్రచిహ్నంబు
లగుచామరలు ధవళాతపత్రములు
మొదలైన తనచిహ్నముల నెల్ల నొసఁగి
తుద లేనిప్రేమ సంతోషింపఁజేసి