పుట:Parama yaugi vilaasamu (1928).pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము.

471


యని మొన నాతోడ నరిదండధరుఁడు
మొనసి చేసినకయ్యమునకు మెచ్చితిని
ఒకసీమ యేలుచునున్న తానెంత
సకలభూమియు నేకచక్రంబు గాఁగ
నేలుచునున్నట్టి యేనెంత తలఁప
నీలీల బవరాన నెదిరి నాతోడ
వడిగలబంటైనవాఁడు వో బంటు
కడపట నిలవీనిఁ గన్నది తల్లి
యని సంతసించువాఁడై వేగ మీరు
చని పరాంతకునకు సమ్మదం బొదవఁ
దనశౌర్యమునకు నెంతయును మెచ్చితిని
మును సేయు నపరాధమును దాళుకొంటి
నెన్న మున్నిటికంటె నినుమడి గాఁగ
మన్నింతు నని చెప్పి మఱియు నేమైన
నడిగినమాటన ట్టతనికి నిచ్చి
యెడపక తోడితెం డిపుడె నాకడకుఁ
బోఁడిమి నావీరపుంగవు నిటకు
నేఁడె తోతెచ్చువానికి మెచ్చుగలదు
అనుఁడు వా రాకమలాపూర్ణపురికి
జని కొల్వులో శత్రుశమను నీక్షించి