పుట:Parama yaugi vilaasamu (1928).pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

415



తనుఁ గోరియున్నవైదర్భికై మున్ను
మొనసిన శిశుపాలముఖుల దండించి
పరచింత లుడిగి నిర్బరవృత్తిఁ దనదు
చరణపద్మంబులు శరణొందునట్టి
దంతిపౌలస్త్యగౌతమసతీవిహగ
కౌంతేయసుతులాదిగాఁ గలవారిఁ
బాలించినట్టి శ్రీపతి రంగనాథుఁ
డేలకొ నను నింత యెరపుగాఁ జూచె
నలకలలోన న న్నంగజకేళి
నలుకలు దీర్చి నాయలుకలు దీర్చి
యెనసి నిమేషంబు నెడఁబాయ నిన్ను
నని బాస యిచ్చి తా నరిగి రాఁడయ్యె
డక్కుల రేనిమాటలు పల్కు వార
లెక్కడఁ గల రతం డేమికావించుఁ
దహతహ లేల యాతనిసద్విజిహ్వ
సహవాస మీరీతి సవరించెఁ గాక
యని యిట్లు దూరుచు నాకోమలాంగి
మనసిజువేడిఁ గ్రుమ్మరుచున్నయపుడు
వెడవిలునెరప్రొద్దువిరహంపుటెండ
వడదాఁకి యున్న చెల్వను విలోకించి