పుట:Parama yaugi vilaasamu (1928).pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[26]

పంచమాశ్వాసము

401


రాజాస్య ! యష్టాక్షరము మౌనివరుల
కోజమై నుపదేశ మొసఁగినగురుఁడు
శౌరి శ్రీబదరికాశ్రమవాసుఁ డైన
నారాయణు డు జగన్నాథుండు చెలఁగు
గరుడాద్రివాసుండు కాంచనకశిపు
హరణుండు యోగముద్రాసనాయతుఁడు
నరసింహుఁ డనయమానవభక్తవరదుఁ
డిరవొందు నెంతయు నిభరాజగమన
కీరవాణిరొ! విను కేరళపురిని
వీర రాఘవుఁ డన వెలయుచునుండుఁ
బొరిఁబొరి శ్రీపతిపురమధ్యమునను
నరసింహుఁ డనువొందు నరసఖుఁ డబల!
త్రిదశులు వెఱఁగందఁ దృణగుల్మలతలు
మొదలైనవానికి ముక్తి యొనర్చె
దానవాంతకుఁ డయోధ్యావల్లభుండు
జానకీపతి రామచంద్రుఁ డేపారు
మధురలో నెపు డష్టమహిషులంగూడి
మధువైరి కనుపట్టు మధుకరచికుర!
వ్రేతలతోఁగూడ వ్రేపల్లెశకట
పూతనాదుల నెల్లఁ బొరిగొన్నవాఁడు