ఈ పుట ఆమోదించబడ్డది
24
పరమయోగివిలాసము.
అందఱు నాచంద మరయరు వారి
నిందఱ నేరీతి నీడేర్తు నింకఁ
దనుఁగొల్వు మని యాత్మఁ దలఁచి యాత్మలకుఁ
దనువు లింద్రియములుఁ దాన యిచ్చితిని
ఇచ్చిన నవి దాల్చి హీనభావముల
నిచ్చలో నామూర్తి నెఱుఁగంగ లేక
యెనయ నిధ్మములఁ దే నిచ్చినకత్తిఁ
గొని యాలతోఁకలు గోసినరీతిఁ
దనుఁ గొల్వనిచ్చిన తనువులు దాల్చి
యనయంబు పరవిషయాసక్తు లగుచు
[1]నాసురప్రకృతు లై యనిశ మనాది
వాసనామూఢు లై వంతలఁ జిక్కి
గొనకొన్నరాట్నపుగుండ్రలకరణిఁ
బనిబూని ఘనకర్మపరతంత్రు లగుచు
నరకంబులందు జన్మంబులయందుఁ
దిరుగుచు నిట్లు వర్తిలెడుజీవులకు
నెలనాఁగ! యే నెట్టు లీడేర్తు నైనఁ
గలదు నుపాయ మొక్కటి విను మింకఁ
దలపోసి వారి కంతర్యామి నగుచుఁ
దెలిసిశ్రీరంగాదిదివ్యదేశముల
- ↑ నసురప్రకృతులయి