పుట:Parama yaugi vilaasamu (1928).pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

368

పరమయోగివిలాసము.


నరనాథుఁ బెక్కుచందముల లాలించి
కరివరారూఢుఁడై క్రమ్మఱ మరలి
తనపురి కేగునత్తఱిఁ బౌరజనులు
వినఁ గ్రొత్తయైన యవ్వృత్తాంత మెల్ల
విని పురిఁ గైసేసి వేవేగ నెదురు
చనుదెంచి ప్రణతు లర్చనలు గావింప
భూరిరత్నాంబరభూషణావళుల
వారి సంభావించి వారనివేడ్క
వారునుం దాము నావటధాముఁ డైన
నీరజనేత్రుసన్నిధికి నేతెంచి
యతనిపాదంబుల కందంద వ్రాలి
నుతి సేసి భక్తి కన్నుల నామతింప
నోతండ్రి! నాలోన నుండి వేదార్థ
జాతంబు భువిలోని జనులెల్ల వినఁగఁ
బలికించువాఁడను బల్కి శుల్కంబు
వలనొప్పఁ గైకొనువాఁడను నేన
యని యానతిచ్చితి రారీతి నయ్యె
ధన మిదే భద్రదంతావళం బిదియె
యని సమర్పించి నిజావాసమునకుఁ
జనుదెంచి యెప్పటిసరవి నిచ్చలును