పుట:Parama yaugi vilaasamu (1928).pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

354

పరమయోగివిలాసము.


అరిగి పురంబెల్ల నంతయు నరసి
తిరిగి యింటికి నేగుదెంచుచునుండి
యొకపంచతిన్నెపై నొక్కండ యలసి
నికటభాగంబున నిద్రించుచున్న
భూసురవరుఁ జేరఁ బోయి యాచెంత
నాసీనుఁ డగుచు నొయ్యనమేలుకొలిపి.
యొక నేర్పుమైఁ బ్రసంగోచితోక్తులను
వికసింపఁ జేసి కైవీడియం బొసఁగి
యెందుండి వచ్చితి వీరీతి నొంటి
నిందేల నిద్రించె దీవు నావుఁడును
బనివడి దివ్యసంపద లొసఁగంగ
మునుమిడి ఘనదోషముల మెసఁగంగ
మహితవిజ్ఞానంబు మదిబొసఁగంగ
నిహపర సౌఖ్యంబు లెసగంగ, జడిసి
దుసికిలిలోనిశత్రులు విసుకంగ
వెస గంగ కరిగి వేవేగంబ మరలి
చనువాఁడ నగుచు నిచ్చట [1]నెండవడిని
వెనుకొన్న బడలిక విశ్రమించెదను
అన విని భూనాథుఁ డవనీసురేంద్రుఁ
గనుఁగొని పలికె.నక్కడఁ బెద్దలైన


  1. నెంతవడిని