పుట:Parama yaugi vilaasamu (1928).pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[23]

పంచమాశ్వాసము.

353


నలకాపురముఁ బోలె నమ్మహానగర
మలరు నచ్చటిమేడలందుఁ జరించు
నేణలోచనలముఖేందుబింబంబు
లేణాంకబింబంబు నెదురుతాకైనఁ
దమపతి యితఁ డంచుఁ దలఁపంగ లేక
భ్రమసి తారాళి యేర్పఱపరాకుండు
నాపట్టణాధీశుఁ డమరేంద్రుఁ దొడరి
యాపట్టణం బేలు నమృతాంశుకులుఁడు
దీపకవల్లభదేవుండు ఘనుఁడు
భూపచంద్రుఁడు పాండ్యభూవల్లభుండు
జనులెల్ల జయలిడ సకలరాజ్యంబు
బనుపడ నెంతయుఁ బాలించుచుండి
తనయేలుపురమునందలిసర్వజనుల
యునికియు వా రాడుచుండువాక్యములుఁ
గన వినం గోరి యొక్కఁడ యొక్కనాఁట
ననయంబుఁ గార్కమ్ము[1] నట్టిరేరేయి
భృంగకాంతుల జళిపించువన్నియల
గొంగడి ముసుఁ గిడుకొని యిల్లువెడలి
వీడులోపల వీథివీథులఁ బౌరు
లాడు వాక్యంబుల నాలకింపుచును


  1. నట్టినడురేయి