పుట:Parama yaugi vilaasamu (1928).pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

పరమయోగివిలాసము.


నెఱుఁగకపోయితి మింతియె మతుల
మఱియొండు వలదు ముమ్మాటికి మాకుఁ
బరమభాగవతునిభవనంబు గాచు
టరయంగఁ బ్రార్థనీయము గాదె యెపుడు
నేవెఱవుననైన నిసుమంతతడవు
శ్రీవైష్ణవులపంచఁ జేరంగఁ గలుగు
నని యున్నవాఁడుగదా వైష్ణవుండు
కనుఁగొన నట్లును గాదు వెండియును
బాటించిఁ వైష్ణవుపంచ నున్నట్టి
కీటంబులును ముక్తికిం బోవు నండ్రు
ఈమహాయోగీంద్రు నింటిమోసాల
నేమందఱము వసియించియుండెదము
ఇంతకంటెను భాగ్య మెయ్యది యనుచు
సంతసం బొదవ హజారంబుమీఁద
విచ్చేసియుండి రావృత్తాంత మెల్ల
నచ్చట నవసరం బరయుచేడియలు
ఇరవొంద నీకార్య మెఱిఁగింపకున్న
వరునిచే వడి నాజ్ఞ వచ్చుఁ బొ మ్మనుచు
నుదిరి కొందలమంది యొక్కరిఁ బట్ట
పదుగురు నగరిలోపలి కేగుదెంచి