పుట:Parama yaugi vilaasamu (1928).pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

పరమయోగివిలాసము.


జెలు వొందు విష్ణుని శ్రీమూర్తులెల్ల
వలచి వేగమె వచ్చి వలచుట్టుకొనుచు
నతులచించాకోటరావాసుయోగి
పతిని సత్కవిసార్వభౌము నీక్షించి
తెలియంగఁ దమతమ దివ్యనామములు
తలపించి [1]తముఁబాడు తముఁ బాడు మనుచుఁ
దోదోపు లాడుచుఁ దొలఁగక నంత
వేదశాఖలు వోలె వెలయుశాఖలను
నవలంబనము సేసి యామ్రానిచుట్టు
బవరిగాఁ జుట్టి శ్రీపతిమూర్తు లెల్ల
వినయభాషణముల వినుతి సేయుచును
మనములోపల మమ్ము మఱవకు మనుచు
నాకారివైరిసంతతి నుతి సేయ
నాకారినందనుం డానంద మంది
మౌనులవిందు లై మాధవాంశముల
వీనులవిందు లై వెలయుసూక్తులను
వారక యొకతరవాటు చేకొనుచు
నీరజోదరుల వర్ణించి వర్ణించి
శ్రీవేంకటేశు రాజీవాస్త్రగురుని
భావించి యతనినిం బలుమాఱు నెన్ని


  1. మముఁబాడు తముఁబాడు.