పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిరకారిమహారాజు కథ

20


మలయవతి, గూడి యిష్తభోగంబుల ననుభవించుచు, సుఖంబుగా నుండెను.


మూఁడవ రాత్రి కథ.

మూఁడవనాటిరాత్రి యధా పూర్వంబుగఁ గృష్ణార్జును లిరువుఱును యమునాసిక తాతలంబునం దాసీనులై నాగవల్లీ దళ చర్వణ బొనరించుతరి, పార్టుండు కేశవుం దిలకించి——"స్వామి! గతరాత్రి వచించిన కథ యద్బుతంబై యోప్పారె! నేటి రేయి మూఁడవదియగు నాదానందతత్వముతో గూడిన పుణ్యకధ నెఱిగించి ధన్యుం జేయవే!" యని ప్రార్థింప సధోక్షజుండు భీభత్సుం గాంచి——"విజయా! చిరకారి మహారాజు చరితంబు జెప్పెద నాకర్ణింపుము. దీనివలన నీయభీష్టం బీడేరెడు" నని పలికి యిట్లు వచింపఁ దోడంగె——

చిరకారి మహారాజు కథ.

తోల్లి మిధిలాపురంబును మేధానిధియను రాజోత్తముండు ధర్మజ్జుఁడై పరిపాలించుచుండెను. అతనికి చంద్రరేఖ యను సతీతిలకంబు వలన గళానిధియను పుత్రరత్నం బుదయించెను. ఆబాలునకు షడ్వత్సర ప్రాయంబు గల్గియున్న తరుణంబున, యొక సిద్ధుం డాతనికడ కరుదెంచి, యాతని మానసంబును వైరాగ్యమార్గంబునకు మరల్ప నారాజు కాయ సిద్ధికై——యమ్ముని వెంట హిమాలయంబున కరుగుచు, నప్పటికి, గర్బవతియైయున్న పత్ని నింటవిడిచి, తన సోదరుఁడగు శ్వేతకేతునకు రాజ్యం బప్పగించెను. మేధానిధిరా జరిగినయనంతరంబున శ్వేతకేతుఁడు దుర్మార్గుఁడై వధూనికను నిరాదరణం బోనరింప నాసాధ్వి యట నుండనోపక , విశ్వాసపాత్రురాలగు తన సఖియగు తిలకతోఁ గూడి పాదచారిణియై గర్భ భారంబున నత్యంత శ్రమను సహించుచు, నాఱేండ్ల పుత్రుని