పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31




ర్రాను గుడారుమోకుఁ దెగనొత్తె; బ్రపంచపు సంతలోన దు
గానికి నమ్మెనిన్నుఁ బలుగాకి దలాలి విధాయి యయ్యెయో!


ఖయ్యామునకు శిష్య ప్రాయుఁడైన నిజామి ఉరూజి యిట్లు వ్రాసెను “ఇమాం ఉమ్రఖయ్యాము బల్బు బట్టణమున అమీర్ అబూసాద్ గృహమున అతిథిగనుండినపుడు నే నాయనను సంద ర్శించితిని. ఒకనాఁటి సాయంకాలము తోటలో విహరించుచుండి నాతోడ నిట్లనియేను:“ఇటువంటి స్థలములో నాగోరియుండును. సంవత్సరమునకు రెండు మాఱులు వృక్షములు లతలునాగోరిపై పువ్వులు, ఆకులను రాల్చును.' ఈ మాటలలోని భావము నాకు బోధపడినది. అయినను యిటువంటి శాస్త్రవేత్త నిరర్థకముగ నేదియు మాట్లాడడని నేను తలంచితిని.తర్వాత కొంతకాలమునకు నేను నిషాపూరునకు పోయి ర్యున్నపుడు హాకీం ఉమ్రఖయ్యాము కీర్తి శేషుఁడాయెనని విని ఆయన సమాధిని దర్శించుటకు వెళ్ళియుంటిని. ఒకతోఁట గోడప్రక్క, చల్లని చెట్లనీడ ఆగోరి కట్టబడియుండెను. గాలి వీచినప్పుడెల్ల పువ్వులు, ఆకులు దానిపై పడుచుండెను. పూర్వము ఇమాం ఉమ్రఖయ్యాము చెప్పి యుండిన మాటలు నాకు జ్ఞప్తికివచ్చి అకాంక్షితముగ సా కన్నులు చెమ్మగిల్లెను.” ఉమఖయ్యాము క్రీ. 3. 1123 వ సంవత్సరమున నిషాపూరున భూగర్భము నలంకరించెను.



36