12
యందు వ్రాయంజడియున్నది. ప్రతి మహమ్మదీయునకును ఖురాను అవస్యవతనీయము; కావున పారసీక పండితులకు అరబ్బీ పొండిత్యము అనివార్యమైనది. ఫిర్ దౌసీ కాలఘుననే తక్కిన కవులందఱు మిశ్రమ భాషనే ప్రయోగించిరి.
సెల్జూకు వంశీయులవంటి తురుష్క ప్రభువులు అన్యులయ్యును స్వజాతీయ ప్రత్యేకత నుద్దరింపక పారసీకులలో కలిసిపోయి వారి జాతీయతనే స్వీకరించి పోషించిరి. అరబ్బుల పలుకుబడి అడంచుట కీ రాజకీయనీతి యావశ్యకమై యుండెను. తురుష్క పరిపాలనము పరాయి రాచకమయ్యు స్వదేశీయముగనే పఱిగణింపఁబడెను. పదియవ శతాబ్ది ప్రారంభమున అవతరించిన కవితావల్లి తురుష్క పరిపాలనమున జాతీయజీవన మహావృక్షమున కల్లుకొని కొంచెమించు మించు ఏడువందల సంవత్సరములవలకు పూవులుపూచి కాయలు కాచెను. ఫీర్ దౌసీ షానామా, ఉమ్రఖయ్యాము రుబాయతు, జామి యూసఫ్' వజులైక, సాదీ గులిస్తాను, రూమి మస్నవి, హఫీజు గేయసంపుటము, నిజామి పంచకావ్యములు పారసీక సరస్వతికి రత్నభూషణములై యలరారుచున్నవి.'
పారసీక ఛందస్సు మాత్రాగణబద్ధము. మస్నవి, కసీదా, గజల్, రుబాయ్ నాలుగు కావ్యభేదములు ప్రసిద్ధములైయున్నవి. సంస్కృత రూపకములందు రసము, నాయికా నాయకులు, పూర్వము నిర్ణయింపఁబడి స్వతంత్ర రచనలకట్టి నిబంధనములు ప్రతి బంధకములని క్రమక్రమముగ నిరాదరింపఁబడినట్లు, పౌరసీక కావ్యము లందును కావ్యభేదము ననుసరించి వస్తుభేదము నిర్ణయింపఁబడియు వాడుకయందు అట్టి నియమములు పొటింపఁబడకుండినవి.
మస్నవి:- ఇది మంజరీ ద్విపదకు సరిపోలును. ఈ ఛందస్సు
మన ద్విపదవలె “ఎల్లమరాజునడక యేక నడక" అను సామెత