పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము
సుమారు 48 గ్రామాలను దర్శించారు. అంతవరకూ ఏ ప్రముఖ జాతీయ నాయకుడు ఎప్పడూ కాలుపెట్టి ఎరుగని కుగ్రామములకు కూడ ఆయన పర్యటన భాగ్యం లభించింది. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ పశ్చిమగోదావరి జిల్లాకు ఖద్దరు నిధికై నిర్ణయించిన కోటా రూ.25,000/- లు కాగా వసూలు అయినది ధనరూపంలో రూ.39,436/-లు, వస్తువుల రూపంలో రూ.2000/- లు మొత్తం రూ. 41,436/- లు. 1929లో గాంధీజీ ఆంధ్రదేశంలో 13 జిల్లాలలో పర్యటించగా ఖద్దరు నిధిని చేకూర్చుటలో పశ్చిమగోదావరి తృతీయస్థానము دلة كغاوعoع(O6.28
గాంధీజీ పర్యటనలో అనేక గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీలు, లైgరిలూoSD ಬಿಲ್ಡಿಲು, කිඳාදිකි”තු సన్మాన పత్రములను సమర్పించటంతో పాటు, ఖద్దరు నిధికి విరాళములు అందచేశాయి. ఈ చర్యను సహించలేని జిల్లా కలెక్టరు స్థానిక సంస్థల ధనమును ఖద్దరునిధికి ఇచ్చుట చెల్లదని, వారు తమ సొంత ధనమును మాత్రమే ఇవ్వవలెనని ఉత్తర్వులు జారీచేశారు. గాంధీజీ సందర్శించిన ప్రదేశాలలో ప్రతీ ఒక్కరు ఆయన పట్ల అపూర్వ గౌరవాన్నికనపర్చారు. మండుటెండలలో, చేలగట్ల నుండి బయలుదేరి పుణ్యక్షేత్రాలకు పోతున్నట్లు జన సమూహం తరలి వచ్చింది. గంటలతరబడి, ఎండను కూడ లెక్కచేయకుండా, ಫ್ಲೀಲ, పిల్లలు, వృదులు rveටඨිසී రాకకై నిరీక్షించారు. Յօ3 కప్పలపైన, ప్రహరీగోడలపైన, చెట్లపైన కూడ చేరి గాంధీజీని తనివితీర వీక్షించాలని ప్రజలు తహతహలాడారు. ఆయన నోటినుంచి వెలువడిన ప్రతీమాట వేదవాక్కు කරව ప్రజలువిన్నారు. గాంధీజీ పశ్చిమగోదావరిజిల్లా సందర్శనము అఖండ విజయాన్ని సాధించినదనుటలో సందేహంలేదు. ఈ పర్యటనతో జిల్లావాసులు సహాయ నిరాకరణఉద్యమ విరమణ నాటినుండీ ఏర్పడిన మందకొడితనాన్ని వదిలించుకొని నూతన చైతన్యాన్ని పొందారు. ܩ గాంధీజీ పశ్చిమగోదావరి జిల్లా యాత్ర అనంతరము మంగిపూడి పురుషోత్తమ శర్మ కృష్ణాపత్రికలో 1929 మే, 18 వ తేదీన "పూజాంజలి అనుశీర్షికయందు గాంధీజీని ప్రశంసిసూ ఈ విధంగా పేర్కొన్నారు.
“ధన్యమైనది పశ్చిమగోదావరి. ఆదిని పవిత్ర గోదావరి చేత ఆవల శ్రీ సీతారాముల వలన ధన్యమైన ఈ గడ్డ నేడు మహాత్ముని పాదస్పర్శతో ముమ్మాటికి శాశ్వతంగా ధన్యమైంది. ఆహా ! మహా భాగ్యం. 99
"స్వీకృత సర్వదరిద్రలోకశోకుడు; వశీకృత విశ్వభారత హృదయుడు ; నిఖిల