పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము
బీమవరం
ఆకీవీడు నుండి రాత్రి 7, 30 ని|లకు గాంధీజీ భీమవరం చేరారు. తాలూకా బోరు ఆఫీసు నుండి రెండు ఫర్గాంగుల పొడవున అత్యంత మనోహరంగా అలంకరించిన పందిరిలో 30వేలమందికి పైగా ప్రజలు సమావేశమై గాంధీజీని నిరుపమానమైన ఉత్సాహముతో ఆహ్వానించారు. మహాత్మునికారు ఆజనవాహిని నుండి నెమ్మదిగా తాలూకా బోరు ఆఫీసుకు చేరింది. గాంధీజీని ఎత్తైన వేదికపై ఆసీనులను కావించారు. తాలూకా బోర్డు వారు ఆయనకు సన్మాన పత్రం తో పాటు రూ.2,400/- ఖద్దరు నిధిని సమర్పించారు. ఒక యువకుడు గాంధీజీ చిత్రాన్ని గీసి బహుకరించాడు. ఆ చిత్రాన్ని వేలం వేయగా రూ. 116/- వచ్చింది. తదుపరి గాంధీజీ ಛಬ್ಜಿಲಿು ඡරාට්ෆි, వినియోగములపై ఉపన్యసించారు. అచ్చటనుండి వీరవాసరం, పొలమూరు మీదుగా పెనుమంట్ర 25వ తేదీ రాత్రికి చేరారు. వీరవాసరం, పొలమూరు ప్రజలు రూ.116/- చొuన ఖద్దరు నిధికిcv 20 .وكعملية oمعO وع
36&cole
గాంధీజీ రాత్రి గం| 8.45 నిuలకు పెనుమంట్రలోని డా|దాట్ల నీలాద్రి రాజు ఇంటికి చేరుకున్నారు. డా|దాట్ల నీలాద్రి రాజు, వారికుటుంబం ఖద్దరునిధికి రూ. 8,000/- ఇతరులు ఇచ్చినది రూ.319/- వెరసి రూ.3,319/- చేకూరింది. గాంధీజీ అక్కడ సమావేశమైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఖద్దరు భారతజాతి ఆత్మగౌరవం, పౌరుషం కాపాడగలదని సంగ్రహంగా ఉపన్యసించారు. ఆ రాత్రి నీలాద్రిరాజు ఇంటిలో విశ్రమించారు, ఏప్రియల్ 26వ తేదీ ఉదయం 6 గం|లకు గాంధీజీ, ఆయన సహచరులు పెనుమంట్రకు 20 మైళ్ళ దూరంలో ఉన్న మట్లపాలెంకు బయలుదేరారు. దారిలో ఆలమూరు ప్రజలు రూ. 116/–, జిన్నూరు వాసులు రూ. 116/–, పోడూ
రునందు రుద్రరాజు వెంకట సత్యనారాయణరాజు రూ.116/–, వెలగలేరునందు డా|వేలాల రాఘవరాజు రూ.310/–, వారి సతీమణి రెండు బంగారు గాజులు, గుబ్బలూరు గ్రంధాలయం వారు రూ. 50/- ఖద్దరు నిధికి సమర్పించారు.
మటపాలెం
గాంధీజీ తన బృందముతో ఏప్రియల్ 26వ తేదీ ఉదయం గం|7-25 ని|లకు