పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

వీలుకాకున్నది. నేను వర్గాశ్రమ ధర్మాలను పాటించే హిందువుడను, ఆయన స్వచ్ఛమైన మహమ్మదీయుడు అయినప్పటికీ ఇద్దరమూ కలిసి తిరుగుటకు మాకేమీ అభ్యంతరములేదు. ದಿನಿನಿ ಬಲ್ಗೆ హిందూ-మహ్మదీయ సమ్మేళనము సులభ సాధ్యమని మీరు భావించవచ్చును. ఈ సమ్మేళనము మీదనే మన భవిష్యత్తు ఆధారపడిఉంది."

" వర్ణాశ్రమధర్మాలు ఆయా కులాలు ఎక్కువ, తక్కువలను నిర్ణయించటానికి ఏర్పడలేదు. ఏకులమునకు ఆ కులమే గొప్పది. బ్రాహ్మణులు సర్వసంగ పరిత్యాగులై తమ ధర్మాల్ని పాటిసూ పూర్వకాలంలో చాలామేలు చేకూర్చియున్నారనే మాట ఒప్పకొనక తప్పదు. కాని ఆ బ్రాహ్మణులే చండాలురు మొదలగువారిని తాకరాదని నిర్ణయించి చాల ఉపద్రవమును తెచ్చిపెట్టారు. ఈ అస్పృశ్యతాదోషం ఫెూరపాతకం మనలను ఆవరించియున్నది. భగవద్గీతలో ఎచ్చటనూ చండాలుని తాకరాదని చెప్పలేదు. కావున దీనిని నివారించవలెనని హిందువలనందరినీ కోరుతూ, పంచమాది నిమ్నజాతుల వారిని కొంత ఓపిక కలిగి యుండవలెనని ప్రార్జించుచున్నాను.

ఈ ఆంధ్ర దేశమునందు నాకు ఒక గొప్పలోపం కనిపిస్తూంది. నేను కాకినాడలో ఉండగా కొందరు భోగపు స్త్రీలు నాదర్శనమునకు వచ్చారు. వారివృత్తి విన్నప్పడు నాపాదముల క్రింద భూమి కృంగిపోవనారంభించింది. ప్రతి స్త్రీ మన సోదరీమణియే.