పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

గాంధీ మైదానంలో సమావేశమైనారు. గాంధీజీ ప్రజలమధ్య నుండి అతికష్టముపై సభామండపముపైకి వచ్చారు. (Yට්ටඨිසීදී) దర్శంచినంతనే ఆయనను సమీపమునుండి సందర్శించవలెననే కుతూహలంతో ఒకరినొకరు త్రోసుకుంటూ సభామండపము చుటూకట్టిన కర్రలను విరుగగొట్టి వేదిక పైకి దూసుకొచ్చారు. వేదిక కర్రలతో నిర్మించుట వలన కంపించ సాగింది. గాంధీజీని అంగరక్షకులు వేదిక పైనుండి జాగర్తగా తీసుకొనిపోయారు. ఆ సమయమున పశ్చిమ గోదావరిజిల్లా, చాటపర్రు వాస్తవ్యరాలు మాగంటి బాపినీడు గారి భార్య ಅನ್ನಿಪು'ರಾದೆವಿ గాంధీజీకి రక్షణగానిలిచి, జనబాహుళ్యం నుండి ఆయనను కాపాడింది.

మరుసటి రోజున 'ఆంధ్రరత్న దుగ్గిరాలగోపాలకృష్ణయ్య నాయకత్వంలో సభాస్థలి ವಿರಕ್ಹಲ್ಲು సమర్థవంతముగా నిర్వహించబడ్డాయి. గాంధీజీ, తదితర నాయకులు సహాయనిరాకరణ ఉద్యమ లక్ష్యాలను, ప్రజలు నిర్వహించవలసిన కార్యక్రమాలను వివరించారు. ఆసభయందు ఖద్దరు ధరించిన ఒకే ఒక మూగంటి అన్నపూర్గాదేవి. సభయందు తిరుగుతూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ప్రజలను శాంతముగా నుండమని విజ్ఞప్తిచేసూంది. గాంధీజీ "తిలక్ స్వరాజ్యనిధి'కి చందాలను అభ్యర్థించగానే ఆమె తన మంగళ సూత్రములు మినహా తనవంటి పైనున్న రూ. 3000/- విలువ కలిగిన 200 కాసుల బంగారు అభరణాలను గాంధీజీకి ఆనందంగా సమర్పించి, సభలోని వారందరినీ ఆశ్చర్యంలో మంచివేసింది. గాంధీజీ 'అమ్మా! నీవు నీ తల్లిదండ్రుల అనుమతి తీసుకొన్నావా?" అని అనగా 'నా తల్లిదండ్రులునా ఇష్టాన్ని ఎన్నడూ కాదనరు. నా ఆభరణములపై నాకు పూర్తి స్వేచ్చఉంది. ఈ మహత్తర కార్యానికి సహాయపడినందుకు వారు ఆనందిస్తారు కూడా" అని అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడింది. జనసమూహములోనికి వెళ్ళి ధనము, నగలు సేకరించి నిధికి చేర్చింది. గాంధీజీ పై సంఘటనలను అనేక సందర్భాలలో స్వయంగా తెలియచేయటం జరిగింది. ఈ సమావేశాల అనంతరం గాంధీజీ ఆంధ్రలో పర్యటించారు. అందులో భాగముగా סחo&c8 ಮುದ್ದಿ మొదటిసారిగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరును సందర్శించి తమ అమూల్యమైన సందేశాన్ని ఇఛ్ఛారు.

జ్ఞపికలు:

1. M.K.Gandhi - "An Autobiography or A Story Of My ExperimentsWith Truth. The Navajivan Trust, 1927, Ahmedabad. P266. 2. Bipan Chandra-Freedom Struggle, National Book Trust, New Delhi, 1972 Pf 19. 3. దేశభక్త కొండా వెంకటప్పయ్య-మహాత్ముని ఆంధ్రదేశ సంచారముఆంధ్రగ్రంధమాల, చెన్నపురి పే. 5 4. Young India, October, 1927.