ఈ పుట ఆమోదించబడ్డది
ఆయనను ఘనంగా స్వాగతించి, సత్కరించిన వివరాలను కనులముందు కదలాడే విధంగా రచించిన "పశ్చిమగోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము' అనే గ్రంథాన్ని చదివి నా హృదయం ఆనందంతో పులకించింది. గాంధీజీ పాదస్పర్శతో పునీతమైనందున ఈ జిల్లా పసిడి రాసులను వెదజిమ్ముతు ందనటంలో అతిశయోక్తి లేదనుకొంటాను. గాంధీజీ ఆశయాలు, వాటిని సాధించుటకు ఆయన అనుసరించిన మారాలు సర్వకాలములందు అనుసరణీయాలు. "నా జీవితమే నా సందేశం’ అనిన గాంధీజీ వాక్కులు అక్షర సత్కాలు. ఇటువంటి అమూల్యమైన గ్రంథాన్ని అందించిన మిత్రుడు డా|| గాదం గోపాలస్వామి కడు అభినందనీయుడు. ఆయనకు సర్వదానిండైన ఆయురారోగ్యాలు కలగాని, ఈ గ్రంథాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరూ చదివి దేశభక్తికి పునరంకితులు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
"జెైహింద్"