పుట:Oka-Yogi-Atmakatha.pdf/584

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

548

ఒక యోగి ఆత్మకథ

గొందుతున్న ద్వారాల దగ్గర, దివ్యతేజస్సు వెదజల్లుతున్న భవ్యమూర్తులు కొలువై ఉన్నారు.

“నా స్నేహితుడి వెనకాలే, విశాలమైన స్వాగత కక్ష్యలోకి ప్రవేశించాను. అగరుధూపాలూ గులాబీల పరిమళాలూ గాలిలో తేలిపోతున్నాయి. మందమందంగా వెలుగుతున్న దీపాలు వన్నెవన్నెల కాంతుల్ని వెదజల్లుతున్నాయి. కొందరు ఎర్రగా, కొందరు నల్లగా ఉన్న భక్తులు, చిన్న చిన్న బృందాలుగా కూడి అంతశ్శాంతిలో మునిగి మృదుస్వరంతో గానం చేస్తున్నారు. కొందరు ధ్యానముద్రలో ఆసీనులై ఉన్నారు. స్పందన శీలమైన ఆనందం వాతావరణ మంతటా వ్యాపించింది.

“నేను ఆశ్చర్యపడుతూ ఉండగా నాకు దారి చూపిస్తున్న తను, సానుభూతితో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు: ‘నీ కళ్ళకు పండుగగా, ఈ భవనం కళావైభవాన్ని చూసి ఆనందించు. కేవలం నీ గౌరవార్థమే దీన్ని సృష్టించడం జరిగింది కనక.’ ”

“ ‘అన్నా, ఈ భవనం అందం మానవ ఊహకు అతీతమైంది. దీని మూలంలో ఉన్న మర్మ మేమిటో దయచేసి వివరంగా చెప్పు.’ ”

“ ‘సంతోషంగా చెప్తాను.’ నా సహచరుడి నల్లటి కళ్ళు జ్ఞానంతో మెరిశాయి. ‘ఈ భవన సృష్టి విషయంలో వివరించడానికి వీలు కానిది ఏమీ లేదు. బ్రహ్మాండం యావత్తూ సృష్టికర్త ప్రక్షేపించిన భావనే. రోదసిలో తేలి ఆడుతున్న భూమి అనే ఈ బరువైన పిండం, దేవుడి కల. మానవుడు తన స్వప్నచేతనలో, సకలజీవ సమన్వితమైన సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణంపోసినట్టుగానే దేవుడు, తన మనస్సులోంచే సర్వవస్తు సముదాయాన్ని సృష్టిస్తాడు.’ ”

“ ‘ఈశ్వరుడు మొదట ఈ భూమిని ఒక భావంగా రూపొందిం