పుట:Oka-Yogi-Atmakatha.pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూజ్యమాతతో సమావేశం

509

కొన్నారు. కొన్నేళ్ళకోసారి ఈవిడ, నియతకాలికంగా జరిగే పుష్కరాల్లో పాల్గొనడానికని, ఏకాంతవాసం నుంచి బయటికి వస్తూ ఉంటారు.

ఈ సాధ్వి లాహిరీ మహాశయుల దర్శనానికి తరచు వెళ్తూ ఉండేవారు. ఒకనాడు ఈవిడ, కలకత్తాకు దగ్గరలో ఉన్న బారక్‌పూర్ పేటలో లాహిరీ మహాశయుల పక్కన కూర్చుని ఉండగా, మహాగురువులైన బాబాజీ, మెల్లగా గదిలోకి వచ్చి తామిద్దరితోటీ ముచ్చటించారని ఆవిడ చెప్పారు. “అమరులైన ఆ మహాగురువులు అప్పుడొక తడిబట్ట కట్టుకుని ఉన్నారు. ఏట్లో ఒక మునక వేసి అప్పుడే వచ్చినట్టు,” అంటూ జ్ఞాపకం చేసుకున్నారు. “ఆధ్యాత్మికోపదేశం ఒకటి చేసి నన్ను దీవించారు వారు.”

ఒకానొక సందర్భంలో త్రైలింగస్వామి కాశీలో, లాహిరీ మహాశయులకు ఒక బహిరంగ సమావేశంలో గౌరవాభినందనలు తెలపడం కోసం తమ మౌనవ్రతాన్ని విరమించారు. త్రైలింగస్వామి శిష్యుల్లో ఒకరు దీనికి అభ్యంతరం తెలిపారు.

“గురుదేవా, తాము స్వాములూ సన్యాసులూ అయి ఉండి, ఒక గృహస్థుకు అంత గౌరవం ఎందుకివ్వాలి?”

దానికి త్రైలింగస్వామి జవాబు ఇచ్బారు, “నాయనా, లాహిరీ మహాశయులు దివ్యమార్జాల కిశోరం లాంటివారు: ఆ జగన్మాత తనని ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటున్నారు. దేని కోసం నేను - నా గోచీగుడ్డతో సహా - ప్రతిదీ విడిచి పెట్టేశానో, ఆ పరిపూర్ణ సాక్షాత్కారాన్ని ఆయన సంసారిగా తమ పాత్ర తాము విధ్యుక్తంగా నిర్వహిస్తూనే సిద్ధింప జేసుకున్నారు.