పుట:Oka-Yogi-Atmakatha.pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రియాయోగశాస్త్రం

431

“మనుషుల్ని కబళించే మృత్యువును కబళించు నువ్వు;
మృత్యువే కనక మరణిస్తే, అటుపై మరణించడమే ఉండదు.”[1]

అంతఃపరిశీలన లేదా “మౌనంలో కూర్చోడం” అన్నది శాస్త్రీయమైన పద్ధతి కాదు; ప్రాణశక్తిచేత ముడిపడిఉన్న మనస్సునూ ఇంద్రియాల్నీ బలవంతంగా విడదియ్యడానికి చేసే ప్రయత్నమిది. తిరిగి దివ్యత్వం పొందడానికి ప్రయత్నిస్తూ ఉండే ధ్యానశీలత గల మనస్సును ప్రాణశక్తి ప్రవాహాలు నిరంతరం ఇంద్రియాలవేపు వెనక్కి లాగుతూనే ఉంటాయి. ప్రాణశక్తి ద్వారా మనస్సును ‘నేరుగా’ అదుపులోకి తెచ్చుకునే క్రియాయోగం, అన్నిటికన్న సులువయినది, ఫలవంతమయినదీను. అనంతాన్ని చేరుకోడానికి ఇది అనువైన - అత్యంత శాస్త్రీయమైన మార్గం కూడా. దేవుణ్ణి చేరడానికి ఉద్దేశించిన దైవశాస్త్రమార్గం నిదానమూ, అనిశ్చితమూ అయిన “ఎద్దుబండి” బాట; దానికి భిన్నంగా క్రియాయోగాన్ని “విమాన” మార్గం అనడం న్యాయం.

యోగశాస్త్రం అన్నిరకాల ధారణ, ధ్యాన సాధనల అనుభవ హేతువు మీద ఆధారపడ్డది. భక్తుడు తన సంకల్పానుసారంగా ప్రాణ విద్యుత్ ప్రవాహాన్ని దర్శన, శబ్ద, ఘ్రాణ, రసన, స్పర్శేంద్రియాలనే ఐదు టెలిఫోన్లలోకి పోకుండా ఆపనూ గలుగుతాడు, వాటిలోకి పంపనూ గలుగుతాడు. ఈ ఇంద్రియ సంబంధ భేదనశక్తి సంపాదించిన యోగి, తన మనస్సును సంకల్పానుసారంగా దివ్యలోకాలతో కాని భౌతిక ప్రపంచంతోకాని ఇట్టే కలపవచ్చునని గ్రహించగలుగుతాడు. మరింక తన సంకల్పానికి వ్యతిరేకంగా ప్రాణశక్తి అతన్ని, రౌడీ సంవేదనలకూ


.

  1. షేక్‌స్పియర్ : సానెట్ 146.