పుట:Neti-Kalapu-Kavitvam.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటి కాలపుకవిత్వం


"తరణి కిరణంబు లపుడప్డు తప్తుజేయ
 కాలమేఘాళి సారెకు గప్పుచుండ
 కృష్ణపక్షము లెపుడు కృశింపజేయ
 విమల కమనీయ కౌముదీ హిమకరుండు
 శారద నీశీధినుల వేదజల్లకున్నె"

అని అయిదుపంక్తుల్లో ఆకృతికర్త ఒకనిదర్శనం చెప్పుతాడు. ఇది ప్రకృతిశాస్త్ర ప్రథమపాఠం ఫక్కిగాని కావ్యఫక్కిగాదు. అయినా యింతటితో వూరుకోడు.

"గండశైలము లెన్నొ మార్గమునబడిన
 ఉరునికుంజంబులెన్నొ క్రిక్కిరిసియున్న.
 తీక్ష్ణ కిరణము లెంతబాధించుచున్న
 ఝరమతిరయంబుతోడ వర్షాగమమున
 ఇరుకెలంకులు తెగ బ్రవహింపకున్నె".

అని నిదర్శనాన్ని సాగదీస్తాడు. ఇంకా వూరుకోడు.

"అనిల మామోదమును సతం బాహరింప
 మార్దవము నాతవము రూపుమాపుచుండ
 భృంగములు మకరందము బీల్చుచుండ
 కోమలంబుగ విచ్చి పరీమళంబు
 కుసుమము వసంత వేళనువిసరకున్నె"

అని తిప్పితిప్పి చెప్పుతాడు. ఇంకా వదలడు.

"ప్రేమతో గన్నతల్లి తన్వీడి చనిన
 విరసకంఠాల నడుమను బెరగుచున్న
 అరిభయంబుస నాకుల నడగియున్న
 తరుణ మరుదెంచు చోగలస్వరముతోడ
 ప్రమదభరమున కోకిల పాడకున్నె "

అని వూరుకుంటాడు.

ఈ కవికి వున్న యింతదుర్నివారకవిత్వం ఆంధ్రదేశానికి లభించిందేమో నని యెక్కడనైనా వున్నదేమో నని వెదుకుతున్నాను. శబ్దార్థాలను భావాన్ని అందించేమట్టుకు స్వీకరిస్తూ ఆనందఫలకమైన ధర్మాధర్మ ప్రవృత్తి నివృత్తులను రసాస్వాదప్రదానపూర్వకంగా శ్రోతలకు