ఈ పుట అచ్చుదిద్దబడలేదు
50
వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం
(కోపానలబహుశనీలధూమంత నందకులానికి నల్లతాచు అయి యిప్పటికి కట్టబడుతున్న నాశిఖను వధ్యుడెవడు ఇచ్చగించడు) అని మలయ కేతువిగ్రహాన్ని సూచించ్వి దాన్ని యింకొక్కవిదర్శనంతో
"ఉల్లంఘన్మమ సముజ్జ్వలత: ప్రతాపం
కోపస్య వందకులకాననదూమకేతో:
సద్య: పరాత్మపతిమాణవివేకమూఢ:
క: శాలభేన విధినా లభతాం వినాశం" (ముద్రా)
(నందకులాకానన ధూమ కేతువయిన నాప్రజ్వలించే కోపప్రతాపాన్ని ఉల్లంఘిచి యెవడు ప్రబలమెరుగని మూఢుడు మిడతవలె వినాశం పొందుతాడు) అని ఉపోద్బలంచేస్తాడు.
దు:ఖం అతిశయించి కొంత అధికాలాపం ఆరంభ మయ్యే ఘట్టంలో కాళిదాసు రతివేచ భర్తతొగూడా భార్య పోవాలె ననేఅభిప్రాయానికి
"శశినా సహ యాతికొముదీ సహమె ఘేన తటిత్ ప్రలియతే." (కుమా)
(చంద్రుడితో వెన్న్లెలపోతుంది. మేఘంతో మెరుపులీన మవుతుంది) అని రెండునిదర్శనాలకంటె యెక్కువచెప్పించడు ఇట్లా చెప్పినా "పున:ర్దీప్తి" అనేదోషం రతివిలాసానికి సంక్రమించిందని మమ్మటు డన్నాడు. అది వేరేవిషయం.
కాళిదాసు సాధారణంగా ఒకటి రెందు లేదా మూడు నిదర్శనాలను చెప్పుతాడు. నిదర్శనబాహుళ్యం అరుదు యెక్కడనైనా యిప్పటివలె నిదర్శనపరంపరలు అదికంగావుంటే అవి దోషమేగాని గుణంగాదు.
నిదర్శనపరంపరలు నూమాలుప్రజలకు వుడుకెక్కించే సభల్లో అవసరమైతే కావచ్చునుగాని పరిణతబుద్దులకు ఉద్దిష్టమైన కావ్యాల్లో విసుగూ రోతా పుట్టిస్వవి శ్లేషల్కు వాక్యాల ఉన్మగ్మనిమగ్నతలకు యత్నిస్తూ సర్వార్ధాలకు గార్లించ ఉద్యుక్తమైన కాదంబరిలోని నిదర్శనపరం పరలు ప్రత్యేకించి విమర్శించదగ్గవి గనుక వాటివిచారణ యిక్కడ వదులుతున్నాను.