ఊగుడుమాటల అధికరణం
45
"ఉపస్పృశ్యోదకం సమ్యఙ్ముని స్థిత్వా కృతాంజలిః
ప్రాచీనాగ్రేషు దర్బేమ ధర్మేణాన్వేపతే గతిం.
తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః
పురా యత్ తత్ర నిర్వృత్తం పాణానామలకం యధా
తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ న మహాద్యుతిః
అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః". (రామా)
పుణ్యే హిమవతః పాదే మేధ్యే గిరిగుహాలయే
విశోధ్య దేహం ధర్మాత్మా దర్బసంస్తరమాశ్రితః
శుచిః ననియమో వ్యాసః శాంతాత్మా తపసి స్థితః
జారతస్యేతిహాసస్య ధర్మేణాన్వీక్ష్యతాం గతిం
ప్రవిశ్య యోగం జ్జానేన సోపశ్యత్ సర్వమాన్తతః. (మహాభా)
అవే పంఙ్త్కులు వాల్మీకి యొక్క వ్యాసుడియొక్క ఆత్మవశత్వాన్ని స్థితప్రజ్ఞత్వాన్ని ధర్మతేజస్కత్వాన్ని విదితం చేస్తున్నవి. సర్వభావాలకు మొదట వశుడై సర్వభావాలను పిమ్మట వశంచేసుకొని భావోద్వేగానికి (Emotion)తాను మొదట వశుడై పిమ్మట భావోద్వేగాన్ని తనవశంచేసుకొని సర్గానికి ఉన్ముఖుడయ్యే జగన్నిర్మాతవలె అమోఘువివేకంతో కావ్యసృష్టికి ప్రవృత్తుడవుతున్నాడు. కనుకనే
"అపారే కావ్యసంసారే కవిరేవ ప్రజాపతిః" (ధ్యన్యా)
(అపారమైన ఈ కావ్యసంపారంలో కవియే ప్రజాపతి)
"ననరసరుచిరాం నిర్మితి మాదధతీ కవేర్భారతీ జయతి (కావ్య)
(నవరససుందరమైన నిర్మితిని చేస్తున్న కవివాక్కు సర్వోత్కృష్టంగా వర్తిల్లుతున్నది.)
"నానృషిః కురుతే కావ్యమ్"
(ఋషికానివాడు కావ్యం రచించడు)
అని కవి కీర్తితుడగుచున్నాడు. అంతేగాని కవులు పిచ్చికేకలు వేసి వూగరు. కవులు ఆయాసందర్బాల్లో యిష్టపాత్రలతో సమానుభవం