పుట:Neti-Kalapu-Kavitvam.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ర స్తు.

వాఙ్మయ పరిశిష్టభాష్యం.

వికారాధికరణం

వికారాలు

దయా, సత్య, విజ్ఞాన, ప్రభృతిగుణాలచేత తేజస్వి అయిన మనిషికి వేషాదులు అప్రధానమై అప్రధానంగా తేజస్సుగోచరిస్తుంటుంది. అది లేనప్పుడు వేషం సవరించడం జుట్టుదిద్దడం, ఇట్లాటివి ప్రధానమౌతవి. ఇట్లాటివికారాలు ఈకాలపుకవిత్వంలో తరుచుగాకనబడుతున్నవి.

నాలుగుపాదాలు ముగించి ఆఖరున రెండుమాటలు తగిలిస్తారు. కొందరు దరువులు పట్టిస్తారు కొందరు కృష్ణపక్ష కర్త మూడుపాదాలు వ్రాసి నాలుగోపాదంలో రెండుమాటలు వ్రాసి చాలిస్తాడు.

"మొగముగంటి గనులుగంటి, మొగిలుగంటి పాటవినుచుంటి"
"అదయతను ద్రుంచినారే
                 పెంధూళిఁ
 జిదిమి వెదజల్లినారే
 మొదలంట దూర్చినారే
                భయదాగ్ని
 కీలలను వ్రేల్చినారే"

అని పాదాల్లో యిమడని మాటలను రెండుపాదాల మధ్యన వేసి దరువు కొట్టుతున్నాడు.

"గళఘోరగంభీర ఫెళఫెళార్బటులలో
                               మెరపేలా?
 నిబిడ హేమంతరాత్రీకుంతలములలో
                               చుక్కేలా?"

అని నాలుగుపాదాల్లో యిమడని వాటిని అంతాన వేస్తున్నాడు.