30
వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం
వుచితంగా వుంటే అవి కావ్యానికి గుణాన్నే ఆపాదిస్తవి. ఉచితదశల్లో మనోహరంగా వుండే ఋతుసందేశాలకు చంద్రుడికి కవియెట్లా విముఖుడు కాగలడు? అనుచితంగావుంటే అవి ధోషమే అవుతవి. అంతేగాని అవి వుండడం లేకపోవడం కవిత్వానికి నూతనత్వ మాపాదిస్తవనడం అసంగతం అసిలింతకూ ఋతువర్ణనలూ, చంద్రోపాలంభాదులూ అనుచితమైన జాబితాలుగా లేని మేఘసందేశాదులు శాకుంతలాదులు ఓరోరిబండోడ ఓరందకాడా బంగారు బావా మొదలైన పాటలు చాలాకాలంనుండి వున్నవి దీంట్లో యేమీ కొత్తలేదు. కనుక ఋతువర్ణనలు చంద్రోపాలంబాదులు మొదలైనవి లేకపోవడంవల్ల యీకాలపు కవిత్వం కొత్త అనడం అసంబద్ధమంటున్నాను.
పూర్వాక్షం
అవునయ్యా యిప్పటికవులు ఒకటి రెండుపద్యాలు మాత్రం వ్రాసి ఒకపేజీమీద ప్రత్యేకంగా అచ్చువేస్తున్నారు. వెనకటి కావ్యాలన్నీ యెంతో విపులమైనవి. యిది కొత్త అంటారా?
సిద్దాంతం.
చెప్పుతున్నాను అది అసంబద్దం వెనుకటి కవులుగూడా ఇట్లా ఒకటి రెండు పద్యాలు వ్రాశారు.
"రంజనచెడి పాండవులరిభంజనులైవిరటుగొల్వ పాల్పడిరకటా"
"నరసింహ కృష్ణరాయల కరమరుదుగకీర్తియొప్పె"
'కరిభిత్ గిరిభిత్ కరికరిభిత్ గిరిగిరిభిత్
"కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంబై"
"కాశికావిశ్వేశు గలిసె వీరారెడ్డి"
"రత్నాంబరంబులే రాయడిచ్చు" (చా)
ఇవన్నీ అట్లాటివే వీటికే చాటూక్తు లనిపేరు. ఇప్పటి పద్యకర్తలు వ్రాసేవిగూడా మనోహరంగా వుంటే చాటూక్తులే అవుతవి. వీటిని వీరు కావ్యమంటున్నారు. ఇది కొత్త అంటారా? అది వీలుగాదు. ఒకటి రెండు