24
వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం
కావ్య వైరాగ్య వర్ణనాకర్ణనమున
యతి విటుడుగాకపోవునే యస్మదీయ
కావ్య శృంగారవర్ణనాకర్ణనమున". (నృసింహకవి-కవి కర్ణ)
"ఆమూలా ద్రత్నసానో ర్మలయవలయితాదాచకూలాత్ పయోధేః
యావంతః సన్తి కావ్యప్రణయనపటవః తే విశంకం వదంతు
"మృద్వీకామధ్యనిర్యన్మసృణమధుఝురీమాధురీభాగ్యభాజాం
వాచామాచార్యతాయాః పదమనుభవితుం కోస్తి ధన్యో మదన్య"
(మేరువుమూలంనుండి మలయవలయితమైన సముద్రతీరందాకా వున్న కావ్యకర్తలు నిశ్శంకంగా చెప్పుదురుగాక. ద్రాక్షనుండి వచ్చే చిక్కటి మధువుయొక్క మాధుర్యభాగ్యంగలిగిన వాక్కులకు ఆచార్యపదం అనుభవింప ధన్యుడు నాకంటె అన్యు డెవడున్నాడు. జగన్నాథుడు) యీతీరుగా ఇట్లాటి ఆత్మస్తుతి యేసందర్బంలో చెప్పినా చిరకాలంనుండి వస్తున్నది. ఈఆత్మస్తుతులైనా యే వొకటిరెండు వాక్యాల్లోనో పద్యాల్లోనో చెప్పితే మితంగా వుంటుంది.
"కలికి పాటలకోయిల కులముమాది"
"పికకుమారకు నన్ను బాడుకొన నిమ్ము"
రాళ్లకు జీవకళవచ్చేటట్లు మోళ్లు చిగురులు పెట్టేటట్లు స్వేచ్ఛా
గానం చేస్తాను;
కట్టుబాట్లు తెగేటట్లు ఆకాశం ప్రత్రిధ్వనించగా స్వేచ్చాగానం చేస్తాను;
చిత్త మానంద మయమరీచికలసోల
హృదయ మానంద భంగమాలికలదేల
కనుల నానంద జనితాశ్రుకణములూర
జగము నిండ స్వేచ్ఛాగాన ఝురులనింతు
విశ్వమే పరవశమయి వెంటాడ
జగమునిండ స్వేచ్ఛాగాన ఝురులనింతు
మాయ మయ్యెదను నామధురగానమున
ఏను స్వేచ్ఛాకుమారుడ నేనుగగన
పథవిహారవిహంగమ పతిని నేను