పుట:Neti-Kalapu-Kavitvam.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూతనత్వాదికరణం

9

"రసాలను రస్యమానావస్థకుతెచ్చే ఒకానొక ప్రతిరూపమైన నవదృష్టి" అని నవత్వప్రతిపాద కత్వాన్ని ఆనందవర్ధనుడు ప్రశంసిస్తాడు

"నవేతి క్షణే క్షణేనూత నైర్వైచిత్ర్యైర్జగన్త్యా సూత్రయన్తీ"

(ధ్వ.లో)

(నవఅంటే క్షణక్షణం నూతనవైచిత్ర్యాలవల్ల జగత్తులను చిత్రిస్తూ) అని పైపఙ్త్కులకు అభినవగుప్తపాదులు వ్యాఖ్యచేశారు. ఈ తీరుగా భారతీయులు కవిత్వంయొక్క నూతనత్వాన్ని ఆరాధిస్తున్నారు.

సంస్కృత సంప్రదాయాలను అనుసరించడంవల్ల నూతనత్వానికి అడ్దుగలిగి వాటిమీద ఇప్పుడాదరం తగ్గిందని భారతి సం- 3. సం- 3 లో ప్రకటితమైన వ్రాత అజ్ఞానమూలం భారతీయులు కవిత యొక్క నూతనత్వాన్ని ఆరాధించారని విశదపరచాను. ఆంధ్రకవిత్వంలో ఇప్పుడు నూతనత్వం సిద్ధించింది అని నూతనత్వాన్ని యిక విచారిస్తాను. భారతి మొదలయిన పత్రికల్లోవున్న ప్రణయపద్యాలు నారాయణమ్మ నాయుడు బావపాట, వెంకయ్య చంద్రమ్మపాట అనేకపద్యాల సముదాయ రూపమైన కృష్ణపక్షం వంటిపుస్తకాలు యేకాంతసేవ. కావ్యకుసుమావళి, వనకుమారి, యిటు వంటివన్నీ యిప్పటి నావిచారణకు విషయమన్నాను. ఆనందవర్ధనాదు లన్నట్లు వీటిలో నూతనత్వముండడం సాధారణంగా కవిత్వధర్మమేగాని విశేష మేమీలేదు. ఈ నూతనత్వమే కవికి ప్రాణం. కాళిదాసు భవభూతి మొదలైనవారి కవిత్వమంతా యెక్కడికక్కడ నూతనమే ఈనూతనత్వం ఇప్పటి కవిత్వానికి వుంటే కవిత్వధర్మం సిద్ధించిందనవచ్చును. గాని ప్రాచీన సంప్రదాయాలను తిరస్కరించడంవల్ల యీనూతనత్వం వచ్చిందని నూతనశకమని వెనక యెన్నడూ మన మెరుగని కొత్తకవిత్వమని అనడం అసంబద్దం.

ఆక్షేపం

ఈనూతనత్వంగాదు మేమనేది. అసలు శరీరం జీవం అవయవం ఇవన్నీ మారిపోయి ఒకవిశిష్టమైన కవితాకృతి వచ్చింది అందువల్ల నూతనశకం కొత్తకవిత్వం అని అంటున్నాము. అని అంటారా?