ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీ ర స్తు
వాఙ్మయసూత్ర పరిశిష్టం.
ద్వితీయాధ్యాయం.
నేటికాలపు కృతిరచన
1. నేటి కాలపుకృతుల్లో పద్యం విచారితపూర్వం తక్కిన దేశేతిహాసం పత్రికారచనలు మొదలైనవాట్లో ఉపజ్ఞవిరళం.
2. చౌర్యం బహుళం.
3. అంగాంగి వివేకం మృగ్యం.
4. విచార్యమాణ విషయానబిజ్ఞత తరుచు.
5. తర్జుమాల అమార్గగామిత్వం ప్రాయికం.
6. నేటికాలపుకృతుల్లో వ్యుత్పత్తి వికసితమైన ప్రతిభ అరుదు.
7. భాషావ్యతిక్రమం అసౌష్ఠవం, ఛాందసాలు నేటికాలపుకృతులను వికృతం ఛేస్తున్నవి.
అని శ్రీ - ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర పరిశిష్ఠంలో ద్వితీయాధ్యాయం