Jump to content

పుట:Neti-Kalapu-Kavitvam.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

250

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


అని వచించియున్నాడు. పోనీ శాంతమునకు విభావాది సామగ్రి గలదా అని యందురా? కలదు. వైరాగ్యపరమేశ్వరాను గ్రహసత్పురుష సేవాదులు విభావములు యమనియమాదులను భావములు. మతిస్మృతి చింతాధృతి వితర్కాదులు సంచారి భావములు అయినను సర్వజనా దరణీయము కాకపోవుటచే నశ్లాఘ్యమందురా? రాగద్వేష కలుషితాంతః కరణులగు వారికి రుచింపకపోయినను వీతరాగులకు ప్రేమాస్పదమే గదా. రాగద్వేష కలుషితులకు రుచింపమి హేతువు నంగీకరించెదమేని శృంగారము వీతరాగులకు రుచింపక పోవుటచే నద్దానికిని ఆంక్ష అనివార్యమే అగును. కనుక రసములు తొమ్మిదని స్పష్టపడుతున్నది. ఈ శాంతరసము శ్రవ్యమునందు అంగీకరింపబడినను అభినేయమగు నాట్యమున నిషిద్దమే కదా అను నాక్షేపమునకు సమాధానము మిగిలివున్నది. ఇద్దానికి జగన్నాధపండితులు చెప్పిన జబాబెంతయు శ్లాఘాపాత్రమగుట దాని నిట వివరించెదగాక"

అని వ్రాశారు. "తొమ్మిదని స్పష్టపడుచున్నది" అనే వరకు వీరు ఆ క్షేపాలకన్నిటికి స్వయంగా సమాధానాలు చెప్పినట్లు, చివరదానికి జగన్నాధుడి జవాబును చెప్పబోతున్నట్లు. ఇదంతా ఈ వ్యాసకర్తే వ్రాసినట్లు మనకు ఈమాటల వలన బోధపడుతున్నది. కాని సత్యం విచారించగా పై ఆక్షేపాలు వికల్పించుకొన్నది గాని వాటికి సమాధానం చెప్పింది గాని, వీరు గాదని స్పష్టపడుచున్నది. రత్నాపణంలో కుమారస్వామి సోమయాజి ఆ ఆక్షేపాలను వికల్పించుకొని సమాధానం చెప్పినాడు.

"నాద్యః నిర్వేద ఏవ" శాంతస్యస్థాయి భావ ఇతి మునినాంగీ
 కృతత్వాత్, తచ్చానేక రససాధారణస్య వ్యభిచారిణః సహతోపి
 అమంగళ ప్రాయత్వేపి సజాతీయాగ్రగణ్యత్వం ప్రాధాన్యేన
 కంచి ద్రసవిశేషం ప్రతి అసాధారణస్థాయిత్వం బోధయితు
 మితి ప్రతిపాదనాత్ తదుక్తం కావ్యప్రకాశే నిర్వేదస్యా