పుట:Neti-Kalapu-Kavitvam.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

248

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


ఉత్తరం వ్రాయలేదు; ఈ తీరుగా పీఠికల కోసం కృతికర్తలు ఆశ్రయించడం సాధారణమైన పనిగా వున్నది. అయితే యెంకిపాటలు యేకాంత సేవ మొదలైన వాటికి ఉపోద్ఘాతాలు ఆశ్రయించి స్తుతించి వ్రాయించినవో కావో నాకు తెలియదు. వారే కారణం చేత వ్రాసినా వారు వ్రాసిన వ్రాతలకు నేను బాధ్యుణ్ణి గాను. సర్వాదేశాలకు సర్వకాలాలకు అన్వయించే సత్యాలతో గర్భితమైన భారతీయ సాహిత్య విచారణలను విశదపరచి నా నిర్ణయాలను తెలిపినాను. అవి అసత్యమని యెవరైనా వాదిస్తే వాటికి సమాధానం వుంటే చెప్పుతాను; లేదా నా మాటలు అసత్యమని ఒప్పుకొని వారి వాక్యాలను వినయంతో శిరసావహిస్తాను. అని మాత్రం మనవి చేస్తున్నాను.

అని శ్రీ.. ఉమాకాన్త విద్యాశేఖర కృతిలో వాఙ్మయ సూత్ర

పరిశిష్టంలో ఉపోద్ఘాతాధికరణం సమాప్తం.