పుట:Neti-Kalapu-Kavitvam.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

"That it may be affirmed that in studying this period , we are able to study whatever is essential in poetry"

ఈ తీరుగా ఈ కవితా ఘట్టాన్ని చదివేటప్పుడు ఇంగ్లీషు కవిత్వంలో ప్రధానమైనదంతా, అంటే కవితలో ప్రధానమైనదంతా చదువగలుగుతున్నామని స్పష్టంగా చెప్పవచ్చును) అరి ఆర్ధరు సైమన్సు (Arthur Symons) విశదం చేస్తున్నాడు. భావనా విభుత్వంతో విశిష్టమైన కవిత అంతా రొమాంటికు కవిత అని సాహిత్యవేత్తల అభిప్రాయమన్నాను. భారతవర్షకవితలో ఉదాత్త భావ ప్రకర్షరూపమైన భావనావిస్తృతి చిరకాలం నుండి సంగతమైవున్నది.

"కాచిత్ కవినా నవా దృష్టిః" (ధ్వ. న్యా)
"నూతనైర్వైచిత్ర్యైర్జగంత్యా సూత్రయంతి" (ద్వ. లో)

అని యిట్లా సౌందర్య విలక్షణ్యతత్పరత భారతీ సాహిత్యంలో ప్రాచీన కాలాన్నే విజ్ఞాత విషయం ఇక భావనా విస్తృతిని ఉద్‌బోధించే విశేషం భారత వర్ష ప్రకృతిలోనే వున్నది. అత్యున్నతంగా నభశ్చుంబి అయి నిల్చున్న హిమాలయం, రజత ప్రభలతో ఉదగ్రమై హృదయాలను అధిష్ఠించే కైలాస శృంగం, మానస సరస్సు, హిమగిరి ఉపత్యకలు. అధిత్యకలు, ప్రభూత శక్తితో భూమికి అవతరించే భాగీరథి ప్రభృతి మహానదులు నైమిశం, బదరీవనం, సాంద్రారణ్య పరివృతమైన వింధ్యాచలం, సీతాపావితమై న గోదావరి తీర భూములు ధర్మస్థిరమైన శ్రీరామచరణం చిహ్నితం చేసిన ఆశ్రమస్థలులు ఋషులు, తపస్సీమలు, శ్రీశైలం. భారత వర్ష కవికి సిద్ధోపదేష్టలై భావనా విభుత్వాన్ని ఉదాత్త భావ ప్రకర్షాన్ని ప్రసాదిస్తున్నవి. ఉతరరామ చరిత కంటె రొమాంటికు కవియెవ్వరు.? యూరోపు ఖండ సాహిత్య దృష్టి ప్రకారం వాల్మీకి ,వ్యాసుడు, భవభూతి ఇట్లాటి కవులందరు రొమాంటికు కవులే అయివున్నారు. అయితే వారి బావసరణులు వేరుగా వచ్చును. ఇట్లాటి యీ భేదాన్నే (Romantic Revolt) రొమాంటికు రివోల్టు అనే గ్రంథంలో