పుట:Neti-Kalapu-Kavitvam.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం

నాయకాధికరణం.

ఆక్షేపం.

అవునయ్యా; యెంకిపాటలవంటి క్షుద్రశృంగారమన్నారు. ఇక వర్తమానాల్లో యెవరిది ఉదాత్తశృంగారం? ఇప్పటి ఆంధ్రదేశపురాజుల్లో జమీందారుల్లో సాధారణమనుష్యుల్లోకంటె యెక్కువ ధర్మరక్షకత్వం కనబడదు. అందరూ ఒకటే దశలో వున్నారు. ఇక ఉదాత్త నాయకులేరీ? అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను; నాయకుణ్ని నెదుక్కోవలసినపని కవిది. ఉచిత నాయకుణ్ని సృజించండి. చేతకాకుంటే వీలులేకుంటే మానండి. వర్తమానంలో యెవరైనా ధర్మరక్షకులు ఉదాత్తశృంగారనాయకులు కనబడితే స్వీకరించండి. అసలు భారతవర్షంలోనే అనేక శతాబ్దులకిందటనే ఆరంభమయిన ధర్మపతనం నేడు అనేకవిధాల ఆంధ్రదేశంలో నల్దిక్కులా విరివిగాగోచరిస్తున్నది. జాతిస్వతంత్రమై సర్వసమృద్ధమై ధర్మార్థ కామాలు అకలుషితాలై వర్తిస్తున్న దశలోవలె జాతిపతితమై జీవితం కుళ్లుడుతో వున్న దశలోఉత్తమకవితోదయానికే అనుకూల్యాలుండవు. మన పద్యం సయితం మురికిలక్షణాలతో వికృతమైవున్నదని పద్యం వ్రాయడమే కవితగాదని పద్యంవ్రాయడం విద్యగాదని యిదివరకే చెప్పినాను. మనస్సు జాతిసాధారణమైన ఈప్రాతికూల్యభారాన్ని తొలగించుకొని స్వచ్ఛవికాసాన్ని పొందడం యేఅలోకసామాన్య