పుట:Neti-Kalapu-Kavitvam.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వనకావ్యాధికరణం

229


(కృషీవలులు) ప్రతిపాదితులు కావడానికి యిక్కడ మనం ఒక్కకులానికి మాత్రం సంబంధించిన కాపుకన్నెలను స్వీకరించడం అనుచితం. ఇది పాశ్చాత్యసరణుల బాహ్యకారాన్ని చూచి చేసే తెలివి తక్కువ పని అంటున్నాను. అవునయ్యా కాపుకన్నెలు పరంపరంగాచేలతో సంబంధించి వున్నారు. ఇప్పటికీ చేలతో సంబంధించిన వారిలో వారిసంఖ్యే యెక్కువ గనుక కాపుకన్నెలనే తీసుకొంటున్నామంటారా? అంటే అనండి.

కాపుకన్నెలను కాపుబావలను గాని అట్లాటి బ్రాహ్మణ్యకన్యలను బ్రాహ్మణబావలనుగాని చిరకాలంనుండి పశువులమందలకు సంబంధించిన గొల్లకన్యలను గొల్లబావలను గాని నాయకులను జేసి యెంకిపాటలవలె కావ్యం వ్రాస్తే ఉదాత్తభావోన్మీలనానికి అవకాశం వుండదని ఇది వరకే విశదంచేశాను. పాశ్చాత్యులు సయితం ఈపాస్టరులు కావ్యాల అప్రధానత్వాన్ని గ్రహించారు.

"Pastoral relying for its distinctive features upon the accidents rather than the essentials of life failed to justify its pretensions as a serious and independent from of art. The trivialtoy of a courtly coterie, it attempted arrogate to itself the position of a Philosophy and in so doing exposed itself to the ridicule of the succeeding ages"

(తన విశిష్టలక్షణాలకు జీవితంయొక్క ప్రధానతత్వంమీద కాకయాదృచ్ఛికమైన అంశాలమీద ఆధారపడే పాస్టరులు కవిత కళయొక్క ఉత్కృష్ఠ స్వరూపంగా స్వతంత్రస్వరూపంగా, ఉండజాలకపోయింది. రాజమందిరమందలి భోగిగణంయొక్క చిల్లరబొమ్మ అయిన యీకవిత తత్వజిజ్ఞాసాగౌరవాన్ని అహంకృతితో పొందగోరి పిమ్మటి తరాలవారి యెకతాళికి గురిఅయింది) అని పాస్టరల్ పొయట్రీ & పాస్టరల్ డ్రామా (Pastoral Poetry and Pastoral Drama) అనే గ్రంథంలో