పుట:Neti-Kalapu-Kavitvam.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


సిద్ధాంతం

వివరిస్తున్నాను; యెంకితోమాట్లాడే సందర్భం గనుక యెంకిభాష మాట్లాడినాడని నాయుడు సంస్కారవంతుడే నని అంటే ఒప్పుకోము. యెంకితో మాట్లాడని యేకాంతసందర్భాల్లోగూడ అత డీభాషనే మాట్లాడినాడు. అక్కడిమాటల రూపమేగాక అభిప్రాయం గూడా సంస్కారహీనులైన మోటువాండ్ల అభిప్రాయదశను దాటజాల లేదు.

"యాడుంటివే యాడుంటివే
 పూతోరిపందిట్లో సీతాయియెల్తుంటె
 నీతళుకుగేపకాన నాతలతిరిగిందోలె
 మెళ్లోపూసలపేరు తల్లోపూవులపేరు
 కళ్లెత్తితేసాలు కనకాబిసేకాలు"

అని మొదలయిన మామూలు ప్రాకృతశబ్దాలు వ్యక్తమవుతవి. ఇట్లా అంతటా యేకాంతంగా మాట్లాడేటప్పుడు చదువురాని శబ్దార్ధాలనే వెలువరిస్తాడు.

"నీవెల్లి పోయినావంటే పచ్చినై"

అని యీతీరున చదువుకోనివాండ్ల శబ్దార్థాలనే వ్యక్తపరుస్తాడు గనుక చదువురాని మోటువాడంటున్నాను.

పూర్వపక్షం

అవునయ్యా. అట్లా మాట్లాడవలె నని మాట్లాడినాడు అంతే గాని అతడు పరిణతుడేనంటారా?

సిద్ధాంతం

చెప్పుతున్నాను; అతడు ఆతీరున కృత్రిమంగామాట్లాడినాడని కవి యెక్కడాతెలుపలేదు. అయినా నాయకుడు కావ్యంలో