పుట:Neti-Kalapu-Kavitvam.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనౌచిత్యాధికరణం

217


అనౌచిత్యం పాలైందంటున్నాను. కనుక అనౌచిత్యం తప్పని దువుతున్నదని చెప్పుతున్నాను.

పూర్వపక్షం

అవునయ్యా; కవివిషయం మాకావశ్యకంగాదు. ప్రకృతి వైపరీత్యం గాని, విరోధంగాని యిక్కడలేదు. కవి ఔచిత్యాన్ని ప్రదర్శించాడు దాన్ని తెలుపుతున్నాము. నాయుడు సంస్కారవంతుడే అయినా యెంకిచదువువల్ల కలిగే సంస్కారంలేని మోటుమనిషి. యెంకితో కలుస్తున్నాడు గనుక యెంకిబాష మాట్లాడుతున్నాడు. ఇందులో యెంకే ప్రధానం. అందుకే యెంకిపాటలని దీనికి పేరు పెట్టినారు. దీంట్లోది యెంకిభాషగాని నాయుడిభాషగాదు. హనుమంతు డిట్లానే రామలక్ష్మణులతో సంస్కృతం మాట్లాడుతాడు. కాని హనుమంతుడిభాష సంస్కృతం గాదుగదా నాటకాల్లో సయితం కార్యసందర్భాన్ని అనుసరించి యీతీరున భాషావ్యతిక్రమం జరగడం కద్దు అందుకే

'కార్యతశ్చోత్తమాదీనాం కార్యో భాషావ్యతిక్రమః"

(కార్యసందర్భాన్ని అనుసరించి ఉత్తమాదులకు సయితం భాషా వ్యతిక్రమం చేయవలసివుంటుంది) అని దశరూపకకర్త అంటున్నాడు. దీన్నే సాహిత్య దర్పణకర్త ఉదాహరించిన ఘట్టంలో వ్యాఖ్యాత

"ఉత్తమస్య రాజాంతఃపురచారిత్వే మాగధీ"

అని ఉత్తములకు కొన్నిచోట్ల ప్రాకృతభాషను వాడవలెనని అభిప్రాయం తెలిపినాడు. యెంకితొకూడేసందర్భం గనుక నాయుడు యెంకిభాష మాట్లాడినాడు. కనుక అది నాయుడిభాషగాదు. అందువల్ల

"సెందురుణ్ణి కూకుండనీదు రామకుష్ట"

అని యిట్లాటి మాటలు మాటలాడినాడన్న మాత్రాన అతడు చదువురాని సంస్కారహీను డనడానికి వీలులేదు. అని అంటారా?