పుట:Neti-Kalapu-Kavitvam.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


కావ్యాల్లో కొమాండూరి కృష్ణమాచార్యకృతి పాదుకాస్తవం భారతిలోని గౌతమీస్రవంతి, వడ్డాది సుబ్బారాయకృతి భక్తచింతామణి, యివన్నీ భావకావ్యాలే అయివున్నవి. పరకీయారతిగల రసాభావం వర్జ్యమని అదే అనుచిత శృంగారమని దుష్టమని యిట్లాటి దోషంలేని చిల్లరజానపదులశృంగారం జింకలు పక్షులు తుమ్మెదలు మొదలైన వాటి శృంగారం కొంతవరకు ఆస్వాద్యమే నని యిదివరకు వ్యక్తపరచాను. కనుకనే

"రసభావౌ తదాభాసౌ
 భావస్య ప్రశమోదయౌ
 సంధిశ్శబలతా చేతి
 సర్వేపి రసనాద్రసాః (సాహి)

అని అన్నారు ఇట్లా చిల్లరజానపదుల శృంగారం జింకలు మొదలైన వాటి శృంగారం కొంతవరకు ఆస్వాద్యం గనుకనే కావ్యంలో అంగంగా స్వీకరించా రని అదే ప్రధానమైతే ఆకావ్యం ఉదాత్తభావోన్మీలనాన్ని ఆనుషంగిక ఫలప్రాప్తిని కోల్పోయి క్షుద్రమవుతుందని యిదే చిల్లరశృంగారమని విశదంచేశాను.

అని శ్రీ ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర పరిశిష్టంలో

క్షుద్రకావ్యాధికరణం సమాప్తం.