పుట:Neti-Kalapu-Kavitvam.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపు కవిత్వం

2. అతివిశాలాలై అత్యంతముగ్దతచేత విలాసా లెరుగని నేత్రాలు సకృద్ధర్శనంచేత కృతార్ధాలైనప్పటికీ ఆనేత్రాలతో కృష్ణుణ్ణి చూసి గోపాంగనాజనం తనియలేదు.

3. శుకాలను వారించబొయ్యేటప్పటికి జింకలు సస్యాన్ని చెడగొట్టుతుండగా వరిపొలాలవద్ద అటు ఇటు తొక్కులాటపడుతున్న గోప స్త్రీలను కృష్ణుడు చూశాడు అని

"వనేచరాణాం వనితాసఖానాం
 దరీగృహోత్సంగ నిషక్తభాసః
 భవంతి యత్రౌషధయో రజన్యాం
 అతైలపూరాః సురతప్రదీపాః" (కుమార)

గుహల్లో వెలుతురుకలుగజేస్తూవుండే ఓషధులు రాత్రుల్లో వనితాసఖులైన వనేచరులకు తైలంలేని సురతప్రదీపా లవుతుంటవి.

"స్త్రీభూషణం చేష్టిత మప్రగల్భం
 చారూణ్యవక్రాణ్యపి వీక్షితాని,
 ఋజాంశ్చ విశ్వాసకృతః స్వభావాన్
 గోపాంగనానాం ముముదే విలోక్య (భట్టి)

"వివృత్తపార్శ్వం రుచిరాంగహారం
 సముద్వహచ్చారు నితంబరమ్యం,
 ఆమంద్రమంథధ్వని దత్తతాళం
 గోపాంగనానృత్య మనందయత్తం " (భట్టి)

(గోపాంగనలయొక్క అప్రగల్భమైన చేష్టితాన్ని స్త్రీలకు భూషణ ప్రాయమైన దాన్ని చూసి రాముడు ఆనందించాడు. అవక్రాలు